Allu Arjun: నేషనల్ అవార్డ్‌ను చెత్తబుట్టలో పడేస్తా… విశాల్ షాకింగ్ కామెంట్స్

Allu Arjun

రీసెంట్‌గా భారత ప్రభుత్వం నేషనల్ అవార్డ్‌లను ప్రకటించింది. బెస్ట్ హీరో అవార్డ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకోగా, బెస్ట్ హీరోయిన్ క్యాటగిరిలో అలియా భట్, కృతి సనన్ ఈ అవార్డ్‌నే చేజిక్కించుకున్నారు. నేషనల్ అవార్డ్ ప్రక్రియా అంతా సవ్యంగానే ఉంది. కానీ, బెస్ట్ హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెలెక్ట్ కావడంపై సర్వత్ర విమర్శలు వచ్చాయి. దీంతో కొంత మంది అవార్డ్ లపై కొన్ని కామెంట్స్ కూడా చేశారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ హీారో విశాల్ కూడా నేషనల్ అవార్డ్‌లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకే గానీ, నేషనల్ అవార్డ్‌ వస్తే దాన్ని చెత్తబుట్టలో పడేస్తా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తనకు అవార్డ్‌ల కంటే, ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలే ఎక్కువ అనిపిస్తుందని, తనను గత రెడు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో నిలబెట్టిన ప్రేక్షకులకు ఎప్పుడు రుణ పడి ఉంటానని చెప్పుకొచ్చారు. అందుకే అవార్డ్‌ల కంటే, ప్రేక్షకుల అభిమానమే కావాలని కోరుకుంటానని తెలిపారు.

ఈ వ్యాఖ్యలను హీరో విశాల్ తను నటిస్తున్న మార్క్ ఆంటోని ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ మీట్ లో చెప్పారు. కాగా, మార్క్ ఆంటోని ఈ నెల15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఫోన్‌లో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్‌తో మార్క్ ఆంటోని రాబోతుంది. ఈ ప్రెస్ మీట్‌లో విశాల్ తన పొలిటికల్ ఎంట్రీపై కూడా కామెంట్స్ చేశాడు.

- Advertisement -

గతంలో నడిగర్ సంఘం ప్రెసిడెంట్ రాధారవి తనను సభ్యుడిగా ఉండాలని ఆహ్వానించారని, తర్వాత నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి కోసం ఆయనపైనే పోటీ చేసి గెలిచానని గుర్తు చేశారు. అలా తన రాజకీయం భవిష్యత్తు కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను అంటూ పొలిటికల్ ఎంట్రీపై స్పందించాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు