Aditi Gautham: పెళ్లి పీటలెక్కిన “నేనింతే” హీరోయిన్

దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎంతోమంది బాలీవుడ్ మోడల్స్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. అందులో శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ ఒకరు. 15 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన నేనింతే చిత్రంతో మాస్ మహారాజ
రవితేజ సరసన మెరిసింది శియా గౌతమ్. ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత శియాకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత చిన్నచితక పాత్రలు చేస్తూ కొన్నికొన్ని సినిమాలలో మెరుస్తూ ఉండేది. ఇక చాలాకాలం తర్వాత పక్కా కమర్షియల్ మూవీలో తలుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా ముంబైకి చెందిన వ్యాపారవేత్త మిఖాయిల్ పాల్కివాల ను వివాహం చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది.

ఫిబ్రవరి 6వ తేదీన బంధుమిత్రుల నడుమ ఆమె వివాహం ఘనంగా జరిగింది. వారి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో సడన్ సర్ప్రైజ్ అంటూ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాత్రి వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ముంబైలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ఇది ప్రేమ పెళ్లా, లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక తెలుగు, హిందీ, కన్నడ, చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ.. మరో మహాభారతం మూవీ లో నటిస్తోంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు