Prabhas: ఆదిపురుష్ హెచ్డీ ప్రింట్ లీక్- 700 కోట్లు నీళ్లపాలు చేసిన ఓం రౌత్.. ?

అసలే సినిమాకి జనాలు అంతంత మాత్రంగా వస్తు, ముక్కి మూలుగుతూ ఎంతో కొంత కలెక్షన్స్ తో థియేటర్స్ లో ఆడుతున్న ఆదిపురుష్ సినిమాకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఎంత కాదనుకున్న రామాయణం ఆధారంగానే ఈ సినిమా తీశారు కదా, ఒకసారైన చూద్దామనే సానుభూతితో వచ్చే జనాలను సైతం ఆదిపురుష్ సినిమాకు వెళ్లకుండా చేసింది మేకర్స్ నిర్లక్ష్యం.

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగే, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలలో నటించారు. వాల్మీకి రచించిన, రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి మూడు రోజులు మిశ్రమ స్పందనతో, మంచి కలెక్షన్స్ తో దూసుకుపోయిన ఈ సినిమా ఆ తరువాత ఢీలా పడిపోయింది. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం ఇప్పటి వరకు కేవలం 450 కోట్లు మాత్రమే వసులు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

సర్వత్రా విమర్శల వెల్లువలో చిక్కుకున్న ఈ సినిమా ఒక పక్క థియేటర్స్ ఆడుతుండగానే హెచ్డీ ప్రింట్ లీక్ నెట్ లో లీక్ అయ్యి, వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా ఒటిటి రిలీజ్ గతంలో సెప్టెంబర్ లో ఉండొచ్చు అని టాక్ వచ్చిన, సినిమా ఫ్లాప్ కారణంగా ఆగస్టులోనే స్ట్రీమింగ్ ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి. వీటన్నిటిని తలకిందులు చేస్తూ హ్యాకర్స్ తమ పనితనం చూపించి ఆదిపురుష్ హెచ్డీ ప్రింట్ ను నెట్ లోకి వదిలారు. దాంతో ఆ లింక్స్ అన్ని ఇప్పుడు వైరలై , సినిమాని అందరు తమ ఫోన్స్ లోనే డౌన్లోడ్ చేసుకొని చూసేస్తున్నారు. దాంతో సినిమా పట్ల కనీస బాధ్యత కూడా ప్రవర్తించిన ఆదిపురుష్ మూవీ టెక్నికల్ టీం ను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. 700 కోట్ల సినిమాను నీళ్లపాలు చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు