MahiV Raghava: యాత్ర2 అప్డేట్.. ఎలక్షన్స్ టైం కల్లా రిలీజ్ కి రెడీ..?

MahiV Raghava:

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆ వేడి సెగ టాలీవుడ్ కి కూడా తగులుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తమ ప్రచారాల్లో ఉండగా, అధికార పార్టీ వైసీపీ కూడా సినిమాల రూపంలో జనాలకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా అప్పట్లో యాత్ర అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ మమ్ముట్టి వైస్సార్ పాత్రలో నటించగా, మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే గాకుండా, వైఎస్ జగన్ ఎలక్షన్లలో గెలవాడనికి చాలా హెల్ప్ అయింది.

ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో మమ్ముట్టి వైస్సార్ గా నటించగా, సెకండ్ పార్ట్ లో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ్ హీరో జీవా నటిస్తున్నాడు. మూడు నెలల కిందటే రెగ్యులర్ షూటింగ్ మొదలవగా, ప్రస్తుతం కడప పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో జీవా, మమ్ముట్టి ఇద్దరూ పాల్గొనగా, ఎలక్షన్స్ ప్రచార నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం యాత్ర2 ఇప్పటికే 70శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని, 2024 సమ్మర్ స్టార్టింగ్ లోనే రిలీజ్ చేసేస్తారని సమాచారం. సమ్మర్ బిగినింగ్ అంటే సరిగ్గా ఎలక్షన్ల సమయానికి ముందే యాత్ర 2 ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి పార్ట్ ఆడినంతగా, రెండో పార్ట్ ఆడుతుందా అంటే చెప్పలేము.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు