Tollywood: పాన్ ఇండియా మోజు తగ్గిపోతుందా..?

టాలీవుడ్లో ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా లేకుండా ప్రతి సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. RRR పుణ్యమా అని పాన్ ఇండియా వైడ్ వచ్చి పడిన క్రేజ్ ఇందుకు కారణం. సినిమాలో కంటెంట్ కొత్తగా ఉండి, పాన్ ఇండియాకు సరిపోయే కథ ఉంటే చిన్న హీరో అయినా కూడా పాన్ ఇండియా వైడ్ హిట్ అవుతుందని కార్తీకేయ 2 సినిమా నిరూపించింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో టైర్ 2హీరోల సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అయితే ఇటీవల నాని హీరోగా వచ్చిన దసరా సినిమా కలెక్షన్స్ తీరు గమనిస్తే, ఈ పాన్ ఇండియా జపం కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని 110కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నాని కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా, పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసిన ఈ సినిమాకు నార్త్ లో కలెక్షన్స్ ఆశించినంత స్థాయిలో రాలేదని తెలుస్తుంది. సినిమా పూర్తిగా తెలంగాణ నేటివిటీలో ఉండటం కథలో కొత్తదనం లేకపోవటమే ఇందుకు కారణంగా అనుకోవచ్చు. దసరా కలెక్షన్లలో మేజర్ షేర్ మన దక్షిణాది రాష్ట్రాల నుండి మాత్రమే వచ్చింది, దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయటం వృధా ప్రయాస అయ్యిందని చెప్పవచ్చు.

దసరా సినిమా రిజల్ట్ చూసి కొంతమంది హీరోలు ఆలోచనలో పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. తమ సినిమాలను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలా వద్దా అన్న అయోమయంలో ఉన్నారట యంగ్ హీరోలు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమా ‘ఏజెంట్’. అసలే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు.మరి పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేసిన ఈ సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేసి రిస్క్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా స్కోప్ ఉంది కదా అని రొటీన్ సినిమాలను కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తే నిర్మాతలు నష్టపోవడంతో పాటు నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు