Samantha: ఆ ఇద్దరి హీరోలు చనిపోబోతున్నారు.. మరో హీరోయిన్ కి అనారోగ్యం – వేణు స్వామి సంచలన జ్యోతిష్యం

రాజకీయ, సినీ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెలబ్రెటీల భవిష్యత్తుకు సంబంధించి సంచలన విషయాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వేణు స్వామి.

సమంత – నాగచైతన్య విడాకులకు సంబంధించి వేణు స్వామి చెప్పిన మాటలు నిజం కావడంతో ఆయన పాపులారిటీ పెరిగింది. ఇక అప్పటినుండి సెలబ్రెటీల గురించి ఆయన చెప్పే వ్యాఖ్యలపై జనాలలో ఆసక్తి పెరిగింది. సెలబ్రెటీలకు సంబంధించి జ్యోతిష్యం చెప్పడం మాత్రమే కాదు వారి కోసం పూజలు కూడా చేస్తాడు వేణు స్వామి. గతంలో రష్మిక మందన, నిధి అగర్వాల్, ఇటీవల డింపుల్ హయాతి కోసం ప్రత్యేక పూజలు కూడా చేశాడు. అంతేకాదు తాజాగా రామ్ చరణ్ – ఉపాసన కూతురు జాతకం గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా మరోసారి వేణుస్వామి గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఓ ఇద్దరు స్టార్ హీరోలు చనిపోబోతున్నారని, వారిలో ఒకరు అనారోగ్యంతో మరణిస్తే.. మరొకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మరో స్టార్ హీరోయిన్ కూడా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుందని చెప్పుకొచ్చారు. వాళ్ల పేర్లు బయట పెట్టలేదు కానీ.. మిధున రాశి, వృశ్చిక రాశి అయిన స్టార్ హీరోలకు ఇలా జరుగుతుందని చెప్పారు. అయితే అందులో ఇప్పటికే నందమూరి తారకరామ్ అనారోగ్యంతో మరణించారు. స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే 2026 లోపు ఇద్దరు హీరోలు మరణిస్తారని తాను ముందే చెప్పానని అంటున్నాడు వేణు స్వామి. అయితే ఆయన చెప్పిన విషయాలలో చాలా విషయాలు నిజం కాలేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు