Tollywood: వెంకీ మామ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా..?

టాలీవుడ్ ఆడియెన్స్ కి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలంటే గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వెంకీ మామ ఇటీవల మారిన మార్కెట్ ఈక్వేషన్స్ కి అనుగుణంగా తన వయసుకి తగ్గ కథలు ఎంచుకుంటూ మల్టీ స్టారర్స్ చేస్తూ తనదైన మార్క్ తో దూసుకెళ్తున్నాడు. కరోనా ప్యాండమిక్ సమయంలో నారప్ప సినిమా ద్వారా ఓటీటీలో సైతం తన సత్తా చాటిన వెంకటేష్ ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. బోల్డ్ కంటెంట్ ఉన్న సిరీస్ లో నటించిన వెంకటేష్ ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాడు.

ఇన్నాళ్లు ఫ్యామిలీ హీరోగా అలరించిన వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ లో బూతులు మాట్లాడటం ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోయారు. ఈ వయసులో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటూ వెంకీపై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఆ తర్వాత, సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో వెంకటేష్ హీరోయిన్ అన్నయ్య పాత్రలో నటించగా ఆ క్యారెక్టర్ సినిమాకు ఏ మాత్రం హెల్ప్ అవ్వకపోగా, ఇలాంటి క్యారెక్టర్ వెంకటేష్ ఎందుకు ఒప్పుకున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో వెంకీ చేసిన క్యామియో కూడా ఆ సినిమాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఈ క్రమంలో వెంకటేష్ ఇక క్యామియోలు, చేయటం మానేసి ఫుల్ లెన్త్ రోల్ ఉన్న సినిమాలు చేయటంపై దృష్టి పెట్టాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం శైలేష్ కొలను డైరెక్షన్లో  సైన్ధవ్ సినిమాలో నటిస్తున్న వెంకటేష్ రానా నాయుడు పార్ట్2 ద్వారా 2024 సంక్రాతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకి రానున్నారని వార్తలొస్తున్నాయి. ఈ సారిరాబోయే పార్ట్2 లో బూతుల స్థాయి కొంచెం తగ్గించారని అంటున్నప్పటికీ వెంకటేష్ మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు