Allari Naresh: మరోసారి సీరియస్ కథతో నరేష్..!

అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా కామెడీ సినిమాలతో హిట్స్ అందుకొని టాప్ హీరోలకు సైతం పోటీగా నిలిచాడు అల్లరి నరేష్. ఒకానొక సమయంలో ఏడాదిలో అరడజనుకి పైగా సినిమాలు చేసి ఇప్పటి హీరోలకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కామెడీ సినిమాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన నరేష్ ఆ తర్వాత మూస కామెడీ సినిమాలు ఫ్లాప్స్ చవిచూశాడు. అయితే, కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా మధ్యలో ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేసి తనలో కూడా మంచి నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు.

నాంది సినిమా ద్వారా తన ట్రాక్ మార్చిన నరేష్, వరుసగా సీరియస్ కథలతో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. నాంది సినిమా తర్వాత వచ్చిన ‘ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం’ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా మంచి ప్రయోగంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నరేష్ ఉగ్రం సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ట్రైలర్లో  సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన నరేష్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అలరించాడు.

నరేష్ మరో సీరియస్ కథతో రానున్నాడని వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా దర్శకుడు సుబ్బు డైరెక్షన్లో నరేష్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడని, ఈ సినిమా కూడా సీరియస్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు. 1980ల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ‘రా అండ్ రస్టిక్’ గా ఉండబోతుందని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని అంటున్నారు. సీరియస్ కథల వైపు ట్రాక్ మార్చిన నరేష్ అదే ట్రాక్ లో కంటిన్యూ అవుతారా లేదా అన్నది ఉగ్రం సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు