SSMB28: మరో సీనియర్ నటిని తీసుకున్నారా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తుంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు.

ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నట్టు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఇటీవల మహేష్ బాబు వెకేషన్ కు వెళ్లి రాగా, యూనిట్ మాత్రం హైదరాబాదులో భారీ సెట్ ను నిర్మించింది. ఇప్పుడు ఇందులోనే సినిమా షూటింగ్ ని జరపబోతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. కుటుంబ కథతో రాబోతున్న ఈ సినిమాలో ఎంతోమంది బడా స్టార్లు నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఎంతోమంది వేరే భాషలకు చెందిన నటీనటులను సెలెక్ట్ చేసుకున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖను తీసుకున్నట్టు తాజాగా తెలిసింది. ఈ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిసింది. అంతేకాదు ఆమెతో త్రివిక్రమ్ మ్యాజిక్ చేయబోతున్నారని అంటున్నారు. సీనియర్ నటి రేఖ దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉండడం వల్లే ఈ చిత్రానికి ఎంపిక చేశారని తెలిసింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు