Star war: విజయ్ – రజినీ ఫ్యాన్స్ మధ్య వార్.. ఈ సారి ఏమైందంటే..?

Star war.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవ జరుగుతూనే ఉంటుంది.. అయితే ఒక్కసారి ఈ గొడవ ఎంతలా మారుతుంది అంటే.. ఆ గొడవలు చివరికి ఆ స్టార్ సెలబ్రిటీల వరకు చేరిపోతాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఫ్యాన్ వార్ ఒకటి సెలబ్రిటీల వరకు చేరినట్టు సమాచారం.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్, దళపతి విజయ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని సమాచారం. అసలు ఈ యుద్ధానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఫ్యాన్స్ మధ్య వార్ కి కారణాలెన్నో..

అసలు విషయంలోకి వెళితే స్టార్ హీరోల అభిమానులు.. వారి అభిమాన హీరోల పై ఉన్న ప్రేమతో వాగ్వాదం చేసుకోవడం ఇదేమి కొత్త విషయం కాదు.. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ గొడవలు మరింత ఎక్కువైపోయాయి. అభిమానుల వార్స్ అనేవి ఒక్కోసారి ఒక్కోరకంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి.. మొదట్లో తమ అభిమాన నటుల సినిమాలు.. ఎన్ని థియేటర్లలో విడుదలయ్యాయి అనే విషయంపై గొడవ పడితే.. ఆ తర్వాత ఏ సినిమా ఎంత వసూలు చేసింది అనే విషయంపై గొడవ జరుగుతూ ఉంటుంది. అలాగే తమ అభిమాన హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో వంద రోజులు ఆడాయి అన్న విషయంపై కూడా వార్ జరుగుతూ ఉంటుంది.. అంతేకాదు కొన్ని సార్లు సంవత్సరాలు తరబడి థియేటర్లలో ఆడి రికార్డ్ సృష్టించిన సినిమాల విషయంలో కూడా ఇలా వార్ జరుగుతూనే ఉంటుంది.

Star war: War between Vijay and Rajini fans.. What happened this time..?
Star war: War between Vijay and Rajini fans.. What happened this time..?

విజయ్ – రజినీ ఫ్యాన్స్ మధ్య వార్..

ఇక అందుకు తగ్గట్టుగానే అప్పట్లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం నడుస్తూ వచ్చేది. ఇప్పుడైతే అది ముదిరి మొదటి రోజు ఓపెనింగ్ వరకు వచ్చేసింది. అది కూడా దాటిపోయి ఇప్పుడు ఇంకొక కొత్త కోణంలో అభిమానుల మధ్య వార్ మొదలయ్యింది.. అదేమిటంటే ప్రస్తుతం అభిమానుల మధ్య వినిపిస్తున్న ప్రధాన పోటీ తమ అభిమాన నటుల పారితోషకం గురించి.. ప్రస్తుతం ప్రతి స్టార్ హీరో కూడా తమ సినిమాను ఒక్క భాషలో కాకుండా అన్ని భాషల్లో విడుదల చేస్తూ.. అందుకు తగ్గట్టుగానే పారితోషకాలు కూడా తీసుకుంటూ వుంటారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు మార్కెట్ కూడా విస్తరించుకున్న విషయం తెలిసిందే.. అందుకే అందుకు తగ్గట్టుగా ఆయా హీరోల పారితోషకాలు కూడా పెరిగిపోయాయి..

- Advertisement -

పారితోషకం విషయంలోనే గొడవలు..

ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో చాలామంది అగ్ర హీరోలకి అభిమాన సంఘాలు ఉన్నాయి. వాళ్లు తమ స్టార్ నటుడు గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉంటారు ..ఈ నేపథ్యంలోనే అటు విజయ్ ఇటు రజినీకాంత్ అభిమానుల మధ్య ఈ పారితోషికం విషయంలో గొడవ మొదలైంది .. మొదట ప్రభాస్ రూ .150 కోట్లు తీసుకుంటూ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా పేరు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ కి వారసుడు సినిమాకు రూ.120 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు విజయ్ పారితోషకం ఒక్కసారిగా పెరిగిపోయింది.. ఆయన చేస్తున్న ఆఖరి సినిమాకి రూ.250 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం.. ఇక ఈ సినిమా చేసి రాజకీయాల్లో నిమగ్నం కాబోతున్నారని తెలిపారు.. అయితే విజయ్ సినిమా ఉంటుందా? లేదా? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు ఏమీ తెలియదు.. కానీ విజయ్ కి ఎలివేషన్ ఇచ్చేందుకు అతని అభిమానులు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు తమ నటుడే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

స్టార్ హీరోలు స్పందిస్తారా..

ఇక మరోవైపు విజయ్ అభిమానులకు దీటుగా ఒక అడుగు ముందుకేసారు రజినీకాంత్ అభిమానులు.. తమ స్టార్ హీరో రాబోయే సినిమా కూలీ కోసం రూ.260 కోట్లు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో గొడవలు జరుగుతూ ఉండడం గమనార్హం.ఇక ప్రస్తుతం ఈ విషయం ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనిపై నిజానిజాలు తెలియాలంటే స్టార్ హీరోలు నోరు విప్పక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు