Trivikram : త్రివిక్రమ్ ఆ నలుగురు హీరోలకే పరిమితం కావడానికి కారణం ఏంటంటే..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న త్రివిక్రమ్ రచయితగా కూడా అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయనను కొన్ని సినిమాలకు రచయితగా చేయించాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు. త్రివిక్రమ్ సినిమాలలో విలువలతో కూడిన కథ, నాలుగు మంచి మాటలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మూవీని ఇష్టపడతారు.

అయితే ఆయన దర్శకుడిగా మారి దాదాపు 20 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు 11 సినిమాలు మాత్రమే చేశారు. అందులో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లతోనే చేశాడు. త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున ఆ సినిమాలో చేయబోయే హీరోని గెస్ చేయవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలు చేస్తే ఆ నలుగురు హీరోలతోనే చేస్తాడు.. వాళ్లకు నచ్చే కథలనే రాసుకుంటాడు. ఇదే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. తెలుగులో ఇక మిగతా హీరోలే లేనట్టుగా త్రివిక్రమ్ మళ్ళీ మళ్ళీ వాళ్ళతోనే సినిమాలు చేస్తున్నాడనే టాక్ ఆయనపై ఎప్పుడూ నడుస్తూనే ఉంది.

అయితే త్రివిక్రమ్ కి కంఫర్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు, మహేష్ బాబుతో ఇప్పుడు గుంటూరు కారంతో కలుపుకొని మూడు సినిమాలు చేశారు. నిజానికి ఆయనతో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో ముందుంటారు. కానీ ఆయన మాత్రం అందరు హీరోలతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించనట్టుగా తెలుస్తోంది. మిగతా దర్శకులతో పోల్చుకుంటే త్రివిక్రమ్ తన సినిమాలలో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ అన్ని కలగలిపి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆయన సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు