సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వస్తున్న తాజా చిత్రం SSMB28. అతడు, ఖలేజ లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నామని, సరికొత్త స్టోరీతో వస్తున్నమని చిత్ర యూనిట్ పలు సార్లు ప్రకటించింది. దీంతో రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
అయితే SSMB28లో ఉండబోయే నటీనటుల గురించి రోజుకు ఒక కొత్త వార్త వస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో నటీనటుల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ కు సంబంధించిన వారిని ఎక్కువగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలోని కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ కనిపించబోతుందట. సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఒక లేడీ కానిస్టేబుల్ పాత్రలో భూమి ఫడ్నేకర్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, అలాంటి పాత్రలో హిందీ భామలు కనిపిస్తే సినిమాపై హైప్ పెరుగుతుందని భూమి ఫడ్నేకర్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుండగా, రెండో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News