Tollywood : సీనియర్ నటుడికి తీవ్ర గాయాలు

టాలీవుడ్ సీనియర్ నటుడు నాజర్ అంటే తెలియని వారుండరు. నాజర్ చాలా సినిమాల్లో విలక్షణ పాత్రలను పోషించారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా, మరి కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపించాడు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ కీలక పాత్రలను పోషించాడు. అయితే నాజర్ గత కొంత కాలంగా వార్తల్లోకి వస్తున్నాడు. నాజర్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరిగింది. అనారోగ్య సమస్యలతో నాజర్ బాధపడుతున్నాడని అందుకే సినిమాలకు దూరంగా ఉండాలిన నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు పుట్టుకొచ్చాయి.

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారని, అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు అనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నాజర్ సతీమణి ఖండించింన సంగతి విధితమే. నాజర్ సినిమాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. తాజాగా నాజర్ మరోసారి వార్తలకు వచ్చాడు. అయితే ఈ సారి నాజర్ కు ఓ ప్రమాదం జరిగిందట. అందులో ఈ సీనియర్ నటుడు గాయపడినట్లు సమాచారం అందుతుంది.

నాజర్ చేస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఓ సీన్‌లో నాజర్ కాలు జారి కిందపడ్డారట. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే ఆస్పత్రికి తరలించారని టాక్ వినిపిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రమాదం సమయంలో సెట్ లో నాజర్‌తో పాటు సుహాసిని, మెహ్రీన్, షియాజీ షిండే కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు