Sada: ఆ హీరోయిన్ చనిపోతూ సదా ని స్టార్ హీరోయిన్ చేసిందా..?

తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన భామల్లో సదా ఒకరు. యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడం వల్ల ఈమెకు జూనియర్ ఎన్టీఆర్ తో నాగ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది. వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం మరలేకపోయింది.

దొంగ దొంగది, లీలామహల్ సెంటర్, మోనాలిసా, ఔనన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మెట్స్, టక్కరి వంటి సినిమాల్లో నటించినా సక్సెస్ లు దక్కలేదు. అయితే ఈమె స్టోరీ సెలక్షన్ విస్ ఫైర్ అవడం కూడా దీనికి ఓ కారణమని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. కానీ జయం సినిమాతో మంచి హిట్ అందుకొని ఈమె స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక సదా ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ అప్పుడప్పుడు సినిమాల్లో పలకరిస్తూ పోతుంది.

అయితే సదా స్టార్ హీరోయిన్ అవ్వడానికి ప్రధాన కారణం మరో నటి అని తెలుస్తోంది. ఆ నటి చనిపోవడం వల్లే సదా స్టార్ హీరోయిన్ అయ్యిందట. ఆ నటి మరెవరో కాదు ప్రత్యూష. ఈమె ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు కానీ.. ప్రత్యూష మోహన్ బాబు హీరోగా చేసిన రాయుడు సినిమాలో ఆయన కూతురిగా చేసింది. అలాగే శ్రీరాములయ్య సినిమాలో పనిమనిషిగా, ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన కలుసుకోవాలని అనే సినిమాలో హీరోయిన్ గా, స్నేహమంటే ఇదేరా సినిమాలో నాగార్జున చెల్లిగా నటించింది.

- Advertisement -

కానీ కొన్ని కారణాల వల్ల ఈమె చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాలో హీరోయిన్ అవకాశం ముందుగా ప్రత్యూషకే వచ్చిందట. ఆ తర్వాత కొంతకాలానికి ప్రత్యూష మరణించడంతో అందులో హీరోయిన్ గా సదాని తీసుకున్నరట. ఇలా జయం సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ గా మారిందని స్వయంగా ప్రత్యూష తల్లి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు