Sandeep raj: మాస్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న కలర్ ఫోటో డైరెక్టర్- క్యాస్టింగ్ చూస్తే షాక్ అవుతారు

కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ నెక్స్ట్ సినిమా గురించి వచ్చిన క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సుహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా పరిచమైన సందీప్ రాజ్ ఇప్పటి వరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు.

కాగా సోషల్ మీడియాలో మాత్రం సందీప్ రాజ్ నెక్స్ట్ సినిమాపై ఒక రూమర్ ట్రెండ్ అవుతుంది. అదేంటంటే మాస్ రాజా రవి తేజ, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లతో కలసి ఒక భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తొందర్లోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా న్యూస్ రానున్నట్టు టాక్ వస్తుంది.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా మారిన ఈ యంగ్ డైరెక్టర్ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. కలర్ ఫోటో సినిమాకు గాను 2020లో బెస్ట్ ఫిలిం కేటగిరిలో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆ తరువాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడా అని అందరు ఎదురుచూస్తుండగా ప్రస్తుతం ఈ న్యూస్ అంతట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రను పోషిస్తున్నాడట.

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమా కథను ఈ ముగ్గురు యాక్టర్స్ కు వినిపించగా, వీరు సానుకూలంగా స్పందించినట్టు టాక్. ప్రస్తుతం ఈగల్, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ, ఈ రెండు సినిమాల తరువాత అనుదీప్ కెవి దర్శకత్వలో సినిమా చేస్తున్నాడనే వార్తలు రాగా, ఇప్పుడు సందీప్ రాజ్ సినిమా తెరపైకి వచ్చింది. అలాగే విశ్వక్ కూడా ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరీ ఈ రూమర్ నిజంగా కార్యరూపం దాల్చుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు