Rakul Preet Singh : ఎట్టకేలకు తెలుగు సినిమా

రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. యంగ్ హీరో సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అప్పటి నుంచి స్టార్ హీరోలతో ఛాన్స్ లను కొట్టేస్తూ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఎక్కువ కనిపించలేదు. కోలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికే షిఫ్ట్ అయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించింది. చివరిసారిగా, పంజా వైష్టవ్ తేజ్ తో కొండపొలం చిత్రంలో నటించింది. దీని తర్వాత మళ్లీ రకుల్ కనిపించలేదు.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఐదు బాలీవుడ్ సినిమాలు, ఒక కోలీవుడ్ చిత్రం ఉంది. కానీ, తెలుగు చిత్రం ఒకటి కూడా లేదు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే చర్చ కూడా సాగింది. దీనిపై పలు రకాల సమాధానాలు వచ్చాయి. అందులో ఒకటి టాలీవుడ్ డైరెక్టర్ల వ్యవహారం రకుల్ కు నచ్చడం లేదట. అందుకే టాలీవుడ్ కు దూరం ఉందని ఓ టాక్ ఉంది.

ఇది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ రకుల్ టాలీవుడ్ లో నటించడానికి ఎట్టకేలకు ఒక చిత్రం ఫైనల్ అయిందని సమాచారం అందుతుంది. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు, బయోపిక్ లు చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ఇటీవల రకుల్ ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఇప్పుడు రకుల్ కు కోరుకున్న స్టోరీ దొరికందని తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు