Rajinikanth: చిరూ కి పద్మ విభూషణ్.. సూపర్ స్టార్ లో మొదలైన అసూయ.. అందుకేనా..?

మెగాస్టార్ చిరంజీవి అనగానే కేవలం టాలీవుడ్ పరిశ్రమకే కాకుండా కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలతో కూడా మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు. ఇందులో ఉండే నటీనటులతో కూడా ఈయనకి మంచి స్నేహబంధం ఉంది.. అందుకే ఎంతోమంది చిరంజీవి తో సమానంగా స్టార్ స్టేటస్ కలిగి ఉన్న నటీనటులను స్నేహభావంతోనే చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది స్టార్ హీరోలు మాత్రం చిరంజీవి పై అసూయతో రగిలిపోతూ ఉంటారు.

అలాంటి లిస్టులో ఇప్పుడు కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ చేరిపోయినట్టుగా తెలుస్తోంది.. అందుకు గల కారణం ఏమిటంటే.. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడమే.. రజనీకాంత్ 2016 వ సంవత్సరంలో ఈ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.. ఆ సమయంలో చిరంజీవి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ.. రజనీకాంత్ కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు.. రజనీకాంత్ లాంటి నటులకు ఇలాంటి అవార్డు దక్కితే.. తనకు దక్కిందనేంత ఆనందంగా ఫీల్ అయ్యారు చిరంజీవి..

కానీ రజనీకాంత్ మాత్రం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పటికీ ఏ ఒక్క పోస్ట్ చేయకపోవడమే కాదు శుభాకాంక్షలు కూడా తెలియజేయకపోవడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.. తమ అభిమాన హీరో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం అసలు రజనీకాంత్ కి సంతోషంగా లేనట్టుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు గల కారణం ఏమిటంటే తన ప్రాణ స్నేహితుడైన మోహన్ బాబుకి ఇవ్వకుండా చిరంజీవి కి ఈ అవార్డ్ ఇచ్చినందుకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది

- Advertisement -

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్క రజనీకాంత్ మాత్రమే చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పకపోవడంతో ఈ కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయం పై మెగా అభిమానులు రజనీకాంత్ పై కాస్త కోపంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి..

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు