Pooja Hegde: ఆవారా సీక్వెల్ కు బుట్టబొమ్మ ఫిక్స్ ?

మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు భాషలతో సంబంధం ఉండదు. హీరో, హీరోయిన్లతో సంబంధం ఉండదు. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. సూపర్ హిట్ అవుతుంది. అలాంటి సినిమా దాదాప 13 ఏళ్ల క్రితం కోలీవుడ్ లో వచ్చింది. లింగు స్వామి దర్శకత్వంలో కార్తీ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా పయ్యా అనే సినిమా వచ్చింది. దీన్నే తెలుగులో ఆవారా గా రిలీజ్ చేశారు.

12 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆవారా సినిమా అప్పట్లో 100 రోజులు ఆడిందంటే… ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఓన్ చేసుకున్నారో.. తెలిసిపోతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని డైరెక్టర్ లింగుస్వామి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా పయ్యా2 (ఆవారా2)పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లో కార్తీ, తమన్నా స్థానంలో కొత్త హీరో, హీరోయిన్లను తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అందుకోసం లింగు స్వామి.. శింబు, సూర్యతో పాటు పలువురు హీరోలతో కూడా సంప్రదింపులు జరిపారట. అయితే వీరికి కథ నచ్చకపోవడంతో సీక్వెల్ కి టైం పడుతుందని సమాచారం. అయితే తాజాగా పయ్యా2 (ఆవారా2)కు హీరో, హీరోయిన్లు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

- Advertisement -

హీరోగా.. ఆర్య, హీరోయిన్ గా పూజా హెగ్డేను డైరెక్టర్ లింగుస్వామి ఫైనల్ చేసినట్టు కోలీవుడ్ వర్గల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకనట వచ్చే సూచనలు కూడా ఉన్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు