తెలుగు చిత్ర పరిశ్రమలో మమతా మోహన్ దాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యమదొంగ, చింతకాయల రవి, కింగ్, కేడి వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ మలయాల కుట్టి. ఈమె చాలా సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా చేసింది. అలాగే కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ఈ హీరోయిన్ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి బారినపడి ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొని నిలబడింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమత తన సినీ కెరీర్ గురించి పలు విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా గురించి పలు కీలక విషయాలను వెల్లడించింది. మమతాకు యమదొంగ సినిమాలో నటించడం కంటే ముందు అరుంధతి సినిమా అవకాశం తనకు వచ్చిందని అయితే తన మేనేజర్.. ఆ సినిమా నిర్మాణ సంస్థ మంచిది కాదని చెప్పడంతో ఆ సినిమాలో నటించడానికి సంకోచించానని చెప్పుకొచ్చింది.
అప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి తనకి ఎక్కువగా తెలియకపోవడం వల్ల శ్యాం ప్రసాద్ రెడ్డి దాదాపు రెండు మూడు నెలల పాటు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశారని, అయినప్పటికీ ఆ సినిమాలో నటించనని చెప్పానని తెలిపింది. ఈ సినిమా వదులుకున్న తరువాత రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో చేశానని తెలిపింది. అయితే అరుంధతి సినిమాని వదులుకున్న విషయం ఇప్పటికే గుర్తొస్తే చాలా బాధగా ఉంటుందని వాపోయింది. ఇక అరుంధతి సినిమా ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News