Mamta Mohandas: ఆ విషయంలో పెద్ద తప్పు చేశా..

తెలుగు చిత్ర పరిశ్రమలో మమతా మోహన్ దాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యమదొంగ, చింతకాయల రవి, కింగ్, కేడి వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ మలయాల కుట్టి. ఈమె చాలా సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా చేసింది. అలాగే కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ఈ హీరోయిన్ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి బారినపడి ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొని నిలబడింది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమత తన సినీ కెరీర్ గురించి పలు విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా గురించి పలు కీలక విషయాలను వెల్లడించింది. మమతాకు యమదొంగ సినిమాలో నటించడం కంటే ముందు అరుంధతి సినిమా అవకాశం తనకు వచ్చిందని అయితే తన మేనేజర్.. ఆ సినిమా నిర్మాణ సంస్థ మంచిది కాదని చెప్పడంతో ఆ సినిమాలో నటించడానికి సంకోచించానని చెప్పుకొచ్చింది.

అప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి తనకి ఎక్కువగా తెలియకపోవడం వల్ల శ్యాం ప్రసాద్ రెడ్డి దాదాపు రెండు మూడు నెలల పాటు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశారని, అయినప్పటికీ ఆ సినిమాలో నటించనని చెప్పానని తెలిపింది. ఈ సినిమా వదులుకున్న తరువాత రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో చేశానని తెలిపింది. అయితే అరుంధతి సినిమాని వదులుకున్న విషయం ఇప్పటికే గుర్తొస్తే చాలా బాధగా ఉంటుందని వాపోయింది. ఇక అరుంధతి సినిమా ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు