Nag Ashwin : భారీ ప్లాన్

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. వైజయంతి మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం నుండి రోజుకు ఒక వార్త బయటకు వస్తుంది. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ పక్కా ప్రణాళికతో తెరకెక్కిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోరుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో బిగ్ బి కీలక పాత్ర చేస్తుండగా, బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అన్ని భాషల నుండి హీరోలు ఈ చిత్రంలో ఉంటే సినిమాపై అంచనాలు పెరుగుతాయని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తుంది. అందుకే ఇతర భాషల్లో ఉన్న స్టార్ నటీ నటులను ప్రాజెక్ట్ కె కు ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు