Mega Family: వాళ్ళు దూరమవుతున్నా కలుపుతున్న ఆ ఇద్దరు..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలకుండే క్రేజే వేరన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోల ఫ్యామిలీస్ ఉన్నా ఈ ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది టాలెంటెడ్ యాక్టర్స్ వచ్చారు. పైగా టాలీవుడ్ ప్రజెంట్ టాప్ హీరోల్లో ముగ్గురు ఈ ఫ్యామిలీ లోనే ఉన్నారు. వాళ్లలో బావ బామ్మర్దులైన రామ్ చరణ్ అల్లు అర్జున్ ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ లో ఎవరికి వారు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోగా, ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు.

అయితే వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారని, ఒకరంటే ఒకరికి పడట్లేదని మీడియా వర్గాల్లో ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. దానికి తోడు ఈ మధ్య ఏ ఈవెంట్లలో కూడా ఒకరి గురించి మరొకరు పెద్దగా ప్రస్తావించుకోవట్లేదు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రం ఎప్పుడూ కలిసి కనిపిస్తారు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నెటిజన్లు సైలెంట్ అయిపోతారు. మెగా ఫ్యాన్స్ ఇంత కన్నా కలిసున్నట్టు ప్రూఫ్ ఏం కావాలని విమర్శకులపై ఎదురు దాడికి దిగుతారు.

అయితే ఈ ఇద్దరి మధ్య ఎన్ని కలహాలు వచ్చినా వీళ్ళని కలిపేది మాత్రం ఆ ఇద్దరు మాత్రమే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్న మాట. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో కాదు కొణెదల ఉపాసన, అల్లు స్నేహ. అవును.. ఈ ఇద్దరు హీరోలు ఈ మధ్య కలవడం మానేసినా వీళ్ళ భార్యల మధ్య బాండింగ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. చెర్రీ బన్నీ కి మనసులో కలవాలని లేకపోయినా వీళ్ళ భార్యల వల్ల కలుస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు జరగగా, అక్కడ కూడా ఉపాసన స్నేహ కలిసే పార్టీ అంతా చూసుకున్నారని సమాచారం. ఇక ఆ పార్టీ లో బన్నీ చెర్రీ కలిసి ఫ్యామిలీతో ఉన్న పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక ఈ పిక్ తో ఇరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా లో షేరింగుల పని మొదలెట్టారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు