Chiranjeevi: మెగా కాంబినేషన్లు ఇక లేనట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను వదిలేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఆయనతో సినిమాలు చేసేందుకు సీనియర్ డైరెక్టర్స్ నుండి అప్ కమింగ్ డైరెక్టర్స్ వరకు అందరూ కథలు సిద్ధం చేస్తూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, వీవీ వినాయక్ కు చిరు కమ్ బ్యాక్ మూవీ డైరెక్ట్ చేసే అదృష్టం వరిస్తే, తర్వాత సురేందర్ రెడ్డి, కొరటాల శివ వంటి సీనియర్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆచార్య, సైరా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కొంత గ్యాప్ తీసుకొని తమిళ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ సినిమా చేసారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.
డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న చిరంజీవి, మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న తన నెక్స్ట్ సినిమా భోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత నుండి వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ వస్తున్న చిరు, ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించినట్టు కనిపిస్తున్నారు. చాలా మంది రైటర్లు, డైరెక్టర్లు తీసుకొస్తున్న కథలను వింటున్న మెగాస్టార్ ఇంకా ఏ స్టోరీని ఫైనల్ చేయలేదట. ఒకవేళ ఏదైనా స్టోరీ నచ్చి ఫైనల్ చేసినా కూడా భోళా శంకర్ సినిమా రిలీజ్ తర్వాతనే అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. అంతే కాకుండా ఇకపై కొత్త దర్శకులతో మాత్రమే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
దీన్ని బట్టి చూస్తే  ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న పూరీ, చిరుల కాంబినేషన్, అప్పట్లో ఒక ప్రీరిలీజ్ ఫంక్షన్లో అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాలు దాదాపు లేనట్లే అన్న క్లారిటీ వస్తోంది. చిరంజీవి ఇలా కొత్త డైరెక్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి వెనుక కారణం రెమ్యునరేషన్ మాత్రమే అని తెలుస్తుంది. సీనియర్ డైరెక్టర్స్ ని పెట్టుకుంటే తాను రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి చిరు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని వినికిడి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు