Mahesh Babu : ‘అ’ సెంటిమెంట్‌

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు. ఇటీవ‌లే స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో సూప‌ర్ హిట్ అందుకున్న మ‌హేష్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది పూర్త‌యిన త‌రువాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళితో ఒక సినిమాను చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ కాంబో అత‌డు, ఖ‌లేజా సినిమాలు వ‌చ్చాయి.

ఇదిలా ఉండ‌గా.. త్రివిక్ర‌మ్ SSMB28 టైటిల్‌ను ‘అయోధ్యలో అర్జునుడు’ గా నిర్ణ‌యించార‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే అత్తారింటికి దారేది, అఆ, అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పురంలో వంటి సినిమాలు అన్ని కూడా అ లెట‌ర్‌తో స్టార్ట్ అయిన‌వే. ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ అనుస‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన మొద‌టి షెడ్యూల్ ప్రారంభ‌మైంది.

రెండో షెడ్యూల్ ద‌స‌రా త‌రువాత ప్రారంభ‌మ‌వుతుంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కేజీఎఫ్ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్లు అన్బు, అరివు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేశారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉంది. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్దే న‌టిస్తుండ‌గా.. హారిక అండ్ హాసిని బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది. అన్నీ కుదిరితే ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28 విడుద‌ల చేస్తార‌ట‌.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు