Kiara Advani: గేమ్ ఛేంజర్ సెట్స్ లో కనిపించని కియారా? ఎందుకు?

Kiara Advani:

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాక అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తుండడం వల్ల ఇద్దరు హీరోయిన్లు నటించడం జరుగుతుంది. రామ్ చరణ్ తండ్రి పాత్రకు అంజలి, కొడుకు పాత్రకి కియారా అద్వానీ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

అయితే గత ఏడాది నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కియారా అద్వానీ రెండు మూడు షెడ్యూల్స్ లోనే పాల్గొనింది. గత నాలుగు నెలలుగా అయితే కియారా గేమ్ ఛేంజర్ సెట్స్ లో అయితే కనిపించలేదు. కానీ సినిమా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంది. కొన్ని రాజకీయాల నేపథ్యంలో సీన్లు షూట్ చేయగా, రీసెంట్ గా మరికొన్ని ఫైట్ సీన్లు షూట్ చేయడం జరిగింది. అయితే గేమ్ ఛేంజర్ సెట్స్ లో కియారా కనిపించకపోవడం వల్ల నెటిజన్లు ఈమె పాత్రకి ఇంపార్టెన్స్ తక్కువ ఉందా అని అంటున్నారు.

దీనిపై మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. గత రెండు మూడు నెలలుగా అయిన షెడ్యూల్స్ లో కియారా పాల్గొనలేదనేది వాస్తవం. అయితే ఆ షెడ్యూల్స్ లో కియారా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. అందులో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్లు షూట్ చేయగా, మరికొన్ని ఫైట్ సీన్లు షూట్ చేసారు. వీటిలో కియారా ఉండదు, కాబట్టి కియారా సెట్స్ కి రాలేదు అని సమాచారం. అయితే సెప్టెంబర్ నుండి జరిగే షెడ్యూల్ లో కియారా పాల్గొనే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు