Tollywood: కామెడీ కంటే ‘A’ సర్టిఫికెట్ సినిమాకే ఎగబడుతున్న జనాలు?

టాలీవుడ్ లో ఈ వారం రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఒకటి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘కీడా కోలా’ సినిమా కాగా, మరొకటి సత్యం రాజేష్ మెయిన్ లీడ్ గా నటించిన ‘పొలిమేర2’. నవంబర్ 3 న రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సెడ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇందులో కీడా కోల కామెడీ డ్రామా గా తెరకెక్కగా, పొలిమేర2 హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

అయితే ఈ రెండు సినిమాలకి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన రాగా, బి,సి సెంటర్లలో కీడా కోల అదరగొడుతుంటే, బి,సి సెంటర్లతో పాటు, కొన్ని ఏ సెంటర్లలలో పొలిమేర2 దుమ్ములేపుతుంది.

అయితే హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి దీనికంటే బెటర్ టాక్ తెచ్చుకున్న కీడా కోల కంటే ఎక్కువ బుకింగ్స్ జరగడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. మార్నింగ్, మ్యాట్నీ లలో కీడా కోలా సూపర్ కలెక్షన్లతో అదరగొట్టగా, ఈవినింగ్ నుండి పొలిమేర2 బాగా బుకింగ్స్ తెచ్చుకుంది. పైగా ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు, పలు బోల్డ్ సీన్స్ కూడా ఉండడంతో A సర్టిఫికెట్ వచ్చింది. అయినా సరే జనాలు ఇవేవి పట్టించుకోకుండా పొలిమేరకే ఓటేస్తున్నారు.

- Advertisement -

అయితే బుకింగ్స్ పరంగా పొలిమేర2 జోరు చూపించినా, కీడా కోల ఆఫ్ లైన్ టిక్కెట్ల ద్వారా పెద్ద నంబర్లని నమోదు చేస్తుంది. మరి రెండు సినిమాల్లో ఏ సినిమా మంచి కల్లెక్షన్లని సాధిస్తుందో చూడాలి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు