Karthikeya2 controversy : హీరో నిఖిల్ కు లీగల్ నోటీసులు- వివాదాల్లో కార్తికేయ పార్ట్ 3

Karthikeya2 controversy

యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. పెద్దగా అంచనాలేవి లేకుండా మీడియం రేంజ్ సినిమాగా రిలీజైన కార్తికేయ 2 సినిమా 2022 లో రిలీజైన సినిమాల్లో ఇండియా వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచి నిఖిల్ ను పాన్ ఇండియా హీరోను చేసింది. ఈ సినిమా తరువాత నిఖిల్ రేంజ్ అమాంతం పెరిగి ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాగా నిఖిల్ కు ఈ రేంజ్ సక్సెస్ ఇచ్చిన కార్తికేయ ఫిలిం సిరీస్ మాత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ2 సినిమా.. 2014 లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్. చిన్న సినిమాగా కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించటంతో కార్తికేయ 2 సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే కార్తికేయ సినిమా మొదటి పార్ట్ ను వెంకట శ్రీనివాస్ నిర్మించగా, కార్తికేయ పార్ట్ 2ను మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

గతేడాది ఆగస్ట్ 13న రిలీజైన ఈ కార్తికేయ2 భారీ కలెక్షన్స్ తో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది. కాగా ఇటీవలనే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా చేయబోతున్నట్టు హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్న ఈ ఇద్దరు తమచేతిలో ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లిట్ అయ్యాక కార్తికేయ3ను స్టార్ట్ చేస్తామని ప్రకటించారు.

- Advertisement -

అయితే కార్తికేయ పార్ట్ 3 విషయంలో సిరువూరి రాజేష్ వర్మ అనే నిర్మాత హీరో నిఖిల్ పై మరియు డైరెక్టర్ చందు మొండేటిపై లీగల్ నోటీసులు జారీ చేయడానికి రెడీ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే కార్తికేయ పార్ట్ 1 సినిమా చేసే సమయంలో కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు రావడంతో కార్తికేయ రిలీజ్ కు సిరువూరి రాజేష్ వర్మ అనే నిర్మాత ఫైనాన్షియల్ హెల్ప్ చేసాడట, దానికి బదులుగా ఈ నిర్మాత కార్తికేయ2 సినిమాను తన బ్యానర్ లో చేయడానికి అగ్రీమెంట్స్ చేసుకున్నాడట కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు..

అయితే నిఖిల్ మీద ఉన్న అభిమానంతో రాజేష్ వర్మ కార్తికేయ పార్ట్ 2 ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో చేయడానికి అంగీకరించాడట. కాగా లేటెస్ట్ గా పార్ట్ 3 అయిన తన బ్యానర్ చేస్తారనుకుంటే నిఖిల్ మరియు చందు మొండేటి పార్ట్ 3 కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో చేస్తామని ప్రకటించడంతో రాజేష్ వర్మ హీరో నిఖిల్, చందు మొండేటిలపై లీగల్ నోటీసులు పంపడానికి రెడీ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కెరీర్ లో సక్సెస్ లు చూస్తూ, పాపులారిటీ తెచ్చుకుంటున్న నిఖిల్ ఈ సమయంలో వివాదాల్లో పడిపోవడం మంచి సూచనా కాదనే చెప్పాలి. మరీ ఈ సమస్య నుంచి ఈ యంగ్ ఎలా బయటపడతాడో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు