విరాజ్ అశ్విన్ హీరోగా పాయల్ రాజపుత్ , సిమ్రత్ కౌర్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ “మాయా పేటిక“. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 30న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సునీల్, శ్యామల. శ్రీనివాసరెడ్డి, హిమజ, రజత్ రాఘవ్ కీలక పాత్రల్లో నటించారు. ఒక మొబైల్ క్రియేట్ చేసే కష్టాల వల్ల ఈ సినిమాలో పాత్రధారులు ఎలాంటి కష్టాలు పడ్డారు. చివరికి ఆ సమస్యల నుండి బయట పడ్డారా లేదా అనేది కథ.
ఇక ఇప్పటికే సినిమాల ప్రమోషన్లు కంటిన్యూ చేస్తున్న చిత్ర యూనిట్ పలు నగరాలకు వెళ్తూ సినిమాని నటీనటులు ప్రమోట్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ లో హీరో,హీరోయిన్లందరూ కలిసి వెళ్తున్నారు. అయితే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది మాత్రం పాయల్ రాజపుత్. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించినా సిమ్రత్ కౌర్ ఎంత మాట్లాడినా పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. ఈ భామ తెలుగులో పెద్దగా సినిమాలు చేయనందువల్ల ఎవరు గుర్తుపట్టలేదు. అదికూడా బోల్డ్ మూవీస్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి తెలియదు.
అందువల్ల ఈ హీరోయిన్ అందరి లాగా ఎక్కువ సందడిగా కనిపిస్తున్నట్టు లేదు. బయటికి చెప్పకపోయినా తనని ఆడియన్స్ పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతుంది కాబోలు. అయినా మాయ పేటిక హిట్ అయితే తన పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడితే బహుశా పాయల్ కంటే ఎక్కువ ఫేమ్ సిమ్రత్ కౌర్ కి రావొచ్చంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ సినిమాలో పాయల్ గ్లామర్ రోల్ చేస్తే సిమ్రత్ కౌర్ పెరఫార్మన్స్ బేస్డ్ రోల్ చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో జూన్30 వరకు వేచి చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News