మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ముందడుగు ఈరోజే పడినట్టే తెలుస్తుంది. ఇక్కడ అడుగు అంటే సినిమా షూటింగ్ అని అర్థం. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు గంజాయి శంకర్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు టాక్.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మొదటిసారిగా సాయి ధరమ్ తేజ్ కంప్లిట్ మాస్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడట. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాని తలపించేలా సాయి ధరమ్ తేజ్ గంజాయి శంకర్ ఉండబోతుందని సమాచారం.
ఈ నెల (అక్టోబర్) 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు వస్తుండటంతో ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తో పాటు, గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇటీవలనే సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఆరోగ్యం దృష్ట్యా కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోబోతున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ కారణంగానే గంజాయి శంకర్ షూటింగ్ నానాటికి లెట్ అవుతూ వస్తుంది. దాంతో సాయి ధరమ్ పుట్టిన రోజున సినిమా ఎనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేసి. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ఇచ్చాక గంజాయి శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.
ప్రస్తుతం వరుస ఫ్లాప్ లలో డైరెక్టర్ సంపత్ నందికి గంజాయి శంకర్ సినిమా చాలా కీలకం కానుంది. అలాగే ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేని పూజా హెగ్డే కు, ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సాలిడ్ హిట్ లేని సాయి ధరమ్ తేజ్ కు కూడా గంజాయి శంకర్ కీలమైనదే అని చెప్పాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.