Guntur Kaaram: బిర్యానీ అయిపోయింది ఇప్పుడు స్వీట్ పెడతారా

సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు పైన తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడూ మంచి అంచనాలు ఉంటాయి. 2024 సంక్రాంతికి రాబోతున్న అన్ని సినిమాల్లో కంటే గుంటూరు కారం సినిమాపై ఎక్కువ అంచనాలు ప్రేక్షకులకు ఉన్నాయని చెప్పొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కావాల్సి ఉంది. రీసెంట్ గా ఈ చిత్రం నుండి “దమ్ మసాలా బిర్యానీ” అనే సాంగ్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కి చాలా తక్కువ రోజులు మాత్రమే ఉండటం, పాట కూడా ఒకటే రిలీజ్ అవ్వటం జరిగింది. దీనితో మేకర్స్ కి మిగతా పాటలు ఎప్పుడు రిలీజ్ చేద్దాం జనాల్లోకి ఎలా తీసుకెళదాం అని చిన్నగా భయం మొదలయింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్, గ్లిమ్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోయినా టీవీలో వాటికి ఇప్పటికి మంచి రేటింగ్ వస్తుంది.

అతడు ఖలేజా తరహాలో కాకుండా ఇప్పుడు చేస్తున్న గుంటూరు కారం సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యే దిశగా త్రివిక్రమ్ దీన్ని ప్లాన్ చేశాడు. దీనిలో మహేష్ కూడా మంచి రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన తరుణంలో ఇప్పుడు రెండో పాటను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది గుంటూరు కారం టీం.

- Advertisement -

ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గా తమన్ ట్విట్టర్ వేదికగా స్వీట్ స్పైసీ అంటూ ఒక మిరపకాయ్ ఇమేజి ని పెట్టి ట్వీట్ చేశారు. దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏంటంటే దీపావళి సందర్భంగా ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ ఉన్నట్లు తెలుస్తుంది. స్వీట్ స్పైసి అని చెప్పిన తరుణంలో ఇప్పటివరకు వచ్చిన మొదటి పాట మాస్ బీట్ తో సాగింది నెక్స్ట్ రాబోయే సాంగ్ ఒక మెలోడీగా ఉండబోతుందని కొంతమంది అభిప్రాయం. మొత్తానికి ముందు బిర్యానీ పెట్టి ఇప్పుడు స్వీట్ ప్లాన్ చేసారు మూవీ టీం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు