Tollywood : మూడో సినిమా రెడీ

దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు మరింత దగ్గర అయింది. తండ్రి మమ్ముట్టి నట వారసుడిగా చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ, నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు దుల్కర్. మహానటి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు ఈ స్టార్ హీరో. ఇటీవల “సీతారామం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తనకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. లెఫ్టినెంట్ రామ్ క్యారెక్టర్ లో దుల్కర్ నటనకు ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు వచ్చాయి. దుల్కర్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా మరో టాలీవుడ్ డైరెక్టర్ కు దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ మూవీకి ఓకే చేశాడని సమాచారం. దుల్కర్ సల్మాన్ కోసం శేఖర్ కమ్ముల అదిరిపోయే కథ సిద్ధం చేశాడని టాక్ వస్తుంది.

హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో తనకంటూ స్టార్ డైరెక్టర్ గా పేరును సొంతం చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఈ డైరెక్టర్ ప్రస్తుతం ధనుష్ తో ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తవగానే తన తర్వాత సినిమా దుల్కర్ తోనే చేయనున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు