Bollywood: శ్రీదేవి డెత్ మిస్టరీని కనిపెట్టిన డాక్టర్లు..!!

భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల పాటు మహారాణిగా వెలిగిన నటి శ్రీదేవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి. అయితే అందంగా, నాజూకుగా కనిపించాలని ఆమె తీసుకున్న జాగ్రత్తల వల్లే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని అంటే అవుననే అంటున్నారు ఆమె మరణాన్ని దగ్గర నుంచి చూసిన కొంతమంది డాక్టర్లు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్… శ్రీదేవికి లోబీపీ ఉందని.. ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోయి మరణించిందని చెప్పుకొచ్చారు. దీంతో డాక్టర్లు కూడా శ్రీదేవి మరణం గురించి చెబుతూ అందం గురించి డైట్ చేసేవాళ్లను హెచ్చరించారు. శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఉప్పు తక్కువగా ఉండే ఫుడ్ ఫాలో అయ్యేదని, అదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు ఓ రకంగా కారణమైందని, డాక్టర్లు సైతం ఇలా ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు.

అయినా ఆమె చనిపోయేంతవరకు కూడా ఉప్పు లేకుండానే తినడంతో అది కాస్త లోబీపీకి దారి తీసి, ఆమె ఆకస్మిక మరణానికి ఇది కూడా ఓ కారణమని ఆమె భర్త బోనీ కపూర్ సైతం చెబుతున్నారు. రుచి పచీ లేని ఫుడ్ తీసుకోవద్దని.. ముఖ్యంగా డైట్ లో ఉప్పును అసలే మిస్ చేయవద్దని చెబుతున్నారు. మనిషి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం తదితర ఆధారంగా మనిషి, మనిషికి సోడియం తీసుకునే విధానం మారుతుంది.

- Advertisement -

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం నుండి ఉప్పును పూర్తిగా స్కిప్ చేయకూడదు. ఉప్పులో ఉండే సోడియం లవణం మరింత అవసరం. ఇది బాడిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. సెల్యూలర్ ఫంక్షన్స్ సరిగా ఉండేలా చేస్తుంది. అందుకే డబ్ల్యూహెచ్వో కూడా ఒక మనిషి ప్రతిరోజు మినిమం 5 గ్రాముల ఉప్పును ఫుడ్ తోపాటు తీసుకోవాలని చెబుతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు