“గీత గోవిందం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ పరశురాం ప్రస్తుతం విజయ్ దేవరకొండతో “ఫ్యామిలీ స్టార్” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో పరశురామ్ కి, గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ కి మధ్య గొడవ జరిగిందంటూ రూమర్స్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. మెగా కాంపౌండ్ లోని మరో ప్రొడ్యూసర్ బన్నీ వాష్ తాజాగా ఈ విషయంపై స్పందించాడు.
“గీత గోవిందం” మూవీ తర్వాత పరుశురాం తమతో ఒక కథ చెప్పాడని, ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే విజయ్ కి ఫోన్ చేసి చెప్పానని బన్నీ వాస్ వెల్లడించాడు. ఆ సినిమా చేయడానికి విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ అంతలోనే దిల్ రాజుతో పరశురాం అదే కథను చెప్పాడని, దిల్ రాజు బ్యానర్ లోనే ఆ మూవీ చేస్తానని అన్నాడని చెప్పుకొచ్చాడు బన్నీ వాస్. ఆ విషయం తెలియడంతో బన్నీ వాస్, అల్లు అరవింద్ బాధపడ్డారట. ఆ విషయాన్ని పరుశురాం తమతో సరిగా కమ్యూనికేట్ చేయలేదని, అసలు విషయం ఏంటో అతని ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా తెలియడంతో అలా జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో తమంత కోపంగానే ఉన్నామని, అందుకు తగ్గట్టుగానే పరశురామ్ పై రియాక్ట్ అయ్యామనీ, కానీ ఆ తర్వాత అతనే ఫోన్ చేసి దానికి వివరణ ఇచ్చాడని వెల్లడించాడు.
నిజానికి “సర్కారు వారి పాట” సినిమా సమయంలోనే దిల్ రాజుకు కథ చెప్పానని, ఆయన ఓకే చేయడంతో ఆ తర్వాత విజయ్ కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు అని, ఆ విషయాన్ని మీతో చెబుదాం అనుకునే లోపే ఇలా జరిగిపోయింది అంటూ పరశురాం వివరణ ఇచ్చాడట. ఇక ఈ వివాదం అంతా జరిగాక దిల్ రాజు ఫోన్ చేసి ఆ సినిమాలో వాటా కావాలంటే తీసుకోమన్నారట. అయితే అల్లు అరవింద్ వద్దని చెప్పేసారట. ఇప్పుడు ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవ లేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా త్వరలోనే విజయ్ – పరుశురాం కాంబినేషన్లో గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తామని ఈ సందర్భంగా బన్నీ వాస్ ప్రకటించాడు. “ఫ్యామిలీ స్టార్” స్టోరీ వెనక ఇంత కథ నడిచింది అనమాట.
గతంలో “గీత గోవిందం” మూవీ హిట్ అవడంతో డైరెక్టర్ పరుశురాం చాలా సినిమాలకు ఒకేసారి కమిట్మెంట్ ఇచ్చాడట. అందులో భాగంగానే కొంతమేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని టాక్ నడిచింది. కానీ ముందుగా అనుకున్నట్టుగా “గీత గోవిందం” తర్వాత పరుశురాం తన నెక్స్ట్ మూవీ అల్లు అరవింద్ తో చేయాల్సి ఉంది. కానీ నాగచైతన్య సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో తీసి తిరిగి వస్తానని పరుశురాం అల్లు కాంపౌండ్ నుంచి బయట అడుగుపెట్టాడు. ఆ తర్వాత కూడా మహేష్ బాబుతో “సర్కారి వారి పాట” మూవీ చాన్స్ రావడంతో నాగచైతన్య మూవీని పక్కన పెట్టి మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ మూవీ చేశాడు. దీంతో 14 రీల్స్ తో పరుశురాంకు ఇబ్బందులు రావడంతో “సర్కారు వారి పాట”లో ఆ ప్రొడక్షన్ హౌజ్ ను కూడా ఒక భాగం చేశారు. పోనీ ఆ తర్వాత అయినా అల్లు అరవింద్ తో సినిమా చేస్తాడేమో అనుకుంటే దిల్ రాజు – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో “ఫ్యామిలీ స్టార్” చిత్రాన్ని ప్రకటించాడు. దీంతో అల్లు అర్జున్ అరవింద్ కు కోపం వచ్చింది. ఇదన్నమాట వీళ్ళ మధ్య జరిగిన అసలు గొడవ.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.