Bollywood: ఆ హీరోయిన్ నో చెప్పడం వల్లే యానిమల్ లో రష్మికకు ఛాన్స్ వచ్చిందా..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు ప్రచార చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానులలో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పైగా ఈ సినిమాలో రణబీర్ కపూర్ వైలెంట్ మోడ్ లో కనిపిస్తూ ఉండడంతో ప్రేక్షకులలో కాస్త క్యూరియాసిటీ పెరిగింది. అయితే తాజాగా ఈ మూవీలో హీరోయిన్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో రష్మికని తీసుకోవడానికి దర్శకుడికి ఏమాత్రం ఇష్టం లేదట. రష్మికను తీసుకోవడానికి ముందు మేకర్స్ వాస్తవానికి పరిణీతి చోప్రా ని సంప్రదించారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి బయటపెట్టారు.

ఈ మేరకు ఆమెని కూడా సంప్రదించారట. కానీ అప్పటికే దర్శకుడు ఇంతియాజ్ తదుపరి ప్రాజెక్టులలో ఆమె బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి చెప్పుకురావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు