కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందట పూజా కార్యక్రమం జరిగిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా రిలీజ్ అయ్యింది. అక్కినేని నాగార్జున, ధనుష్ ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా రూపొందనున్న ఈ సినిమా పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
#D51 అన్న వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా పోస్టర్లో ఒకవైపు స్లమ్ ఏరియా, మరోవైపు ఇండస్ట్రియల్ ఏరియా మధ్య వంద రూపాయల నోట్ల కట్టతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోస్టర్లో ఉన్న వంద నోట్లు పాతవి కావటంతో ఈ సినిమా పీరియాడిక్ డ్రామా అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే శేఖర్ కమ్ముల ప్రతి సినిమాలో సొసైటీకి మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో సామాజిక అసమతుల్యతను, శ్రమ దోపిడీ వంటి అంశాలను టచ్ చేసినట్లు అనిపిస్తుంది. శేఖర్ కమ్ముల గత చిత్రం లవ్ స్టోరీ ఆశించిన స్థాయిలో అలరించకపోవటంతో కొంత గ్యాప్ తీసుకొని ధనుష్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తీ చేశాడని తెలుస్తోంది. మొదట్లో ధనుష్ అక్కడితోనే ప్లాన్ చేసిన ఈ సినిమా తర్వాత నాగార్జున సీన్లోకి ఎంటరవ్వటంతో స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఇద్దరి ఇమేజ్ కి సరిపోయేలా రూపొందించారట.
స్క్రిప్ట్ లో మార్పుల కారణంగానే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా డిలే అవుతూ వస్తోందని తెలుస్తోంది. సినిమా స్టోరీ గురించి వినిపిస్తున్న ఊహాగానాలే గనక నిజం అయితే, ధనుష్ స్లమ్ ఏరియాకి చెందిన కుర్రాడిలా నాగార్జున బిజినెస్ మాగ్నెట్ క్యారెక్టర్లో కనిపించే అవకాశం ఉంది. ఫిదా తర్వాత ఆ రేంజ్ హిట్ సినిమా లేని శేఖర్ కమ్ముల ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News