Dhanush: ముచ్చటగా మూడోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారా.?

రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయిపోయాడు ధనుష్.  ఆ సినిమా తర్వాత ధనుష్ చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయింది.  ఇకపోతే రఘువరన్ బీటెక్ సినిమాకి కంటే  ముందు త్రీ  సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. “కొలవరి” పాట హిట్ అవడంతో త్రీ సినిమా పైన చిన్నగా అంచనాలు పెరిగాయి. ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేసారు. అయితే థియేటర్లో ఆ పాటకు అంత రెస్పాన్స్ రాలేదు.  కానీ యూట్యూబ్లో రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో మాత్రం సంచలమైన రెస్పాన్స్ వచ్చింది.

రఘువరన్ బీటెక్ సినిమా తర్వాత ధనుష్ చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చింది. వాటిని కూడా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇకపోతే కేవలం ధనుష్ హీరోగానే కాకుండా మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు.  సింగర్ గా కూడా ధనుష్ అద్భుతమైన విజయాలు సాధించాడు.  కేవలం సింగర్ నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా మంచి అనుభవం ధనుష్ కి ఉంది.

ధనుష్ ఇదివరకే “పవర్ పాండి” అనే ఒక సినిమాను దర్శకత్వం వహించాడు.  ఇప్పుడు ధనుష్ నటిస్తున్న 50వ సినిమాకి కూడా ధనుష్ దర్శకత్వం వహించినట్లు మనకు తెలిసిందే.  ప్రస్తుతం దీనికి D50 అని పేరు పెట్టారు. తన ల్యాండ్‌మార్క్ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలి ఇంటర్వ్యూలో, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ డి 50 తర్వాత మరో చిత్రానికి ధనుష్ మెగాఫోన్ పట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

- Advertisement -

ఇకపోతే ధనుష్  కెప్టెన్ మిల్లర్ 2024 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయాల్సి ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు