Prabhas : బీ టౌన్ లో క్రేజీ న్యూస్

బాహుబలి సినిమాతో ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీని తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్.. సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి భారీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో ఆది పురుష్ సినిమా రామాయణం ఆధారంగా రాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా పాన్ వరల్డ్ గా విడుదల కాబోతుంది.

ఈ ఆది పురుష్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా, సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతుంది. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల ప్రకారం.. ఆది పురుష్ లో రాము, సీత పాత్రలు చేస్తున్న ప్రభాస్, కృతి సనన్ ఒకరికొకరు రిలేషన్ షిప్ లో ఉన్నారట. ఆది పురుష్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన ఈ బంధం రిలేషన్ షిప్ వరకు దారి తీసిందని తెలుస్తుంది.

అలాగే ఒకరిపై ఒకరికి స్ట్రాంగ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయని బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభాస్ గానీ, కృతి సనన్ గానీ అధికారికంగా ప్రకటించలేరు. కాగా ప్రభాస్ పెద్ద నాన్న, ప్రముఖ నటుడు కృష్ణం రాజు ఇటీవల ఆనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు