Rowdy Hero: ఒక్క కామెంట్ తో విజయ్ ని ముంచేసిన చైతు..!

పరిస్థితులు పగబడితే చేతిదాకా వచ్చింది కూడా వేరే ఎవరి ప్రభావం వల్లనో మనకు అందకుండా పోతూ ఉంటుంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ పరిస్థితి అలాగే ఉంది. అసలే లైగర్ డిజాస్టర్ అయ్యాక విజయ్ మీద ట్రోల్స్ పెరిగి మరింత పెరిగింది, లైగర్ ప్రభావం వల్ల పూరితో చేయాల్సిన జనగణమన ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇదిలా ఉంటే, ఇటీవల నాగచైతన్య డైరెక్టర్ పరశురాం గురించి చేసిన వ్యాఖ్యల ప్రభావం విజయ్ సినిమాపై పడిందని టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే, దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో మొదలవ్వాల్సి సినిమా కోసం నిర్వహించాల్సిన పూజ కార్యక్రమం లాస్ట్ మూమెంట్ లో నిలిపి వేశారట.

పూజ కార్యక్రమం ఆగిపోవటానికి వేరే కారణాలున్నాయని సినిమా యూనిట్ చెప్తున్నప్పటికీ, నాగచైతన్య కామెంట్స్ వల్లనే నిలిచిపోయిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య డైరెక్టర్ పరశురామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో డైరెక్టర్ పరశురామ్, చైతు కాంబినేషన్లో 14రీల్స్ బ్యానర్ పై ఒక సినిమా ప్లాన్ చేశారు. ఇందుకోసం నాగచైతన్య డేట్స్ కూడా కేటాయించాడు. ఆ సమయంలో చెప్పా పెట్టకుండా పరశురామ్ వేరే ప్రాజెక్ట్స్ కి కమిట్ అవ్వటం వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్న చైతు, పరశురామ్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అని, తన టైమ్ అంతా వేస్ట్ చేశాడని అన్నారు.

పరశురామ్ అడ్వాన్సులు తీసుకొని ప్రాజెక్ట్ నుండి వైదొలగటం ఇది కొత్త కాదు. గతంలో గీతా ఆర్ట్స్ వంటి సంస్థల వద్ద కూడా అడ్వాన్సులు తీసుకొని ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు పరశురామ్ ఇష్యూ సెటిల్ కాకుండా విజయ్ సినిమా మొదలు పెట్టడం కుదరదని దిల్ రాజుని సంప్రదించగా పూజ కార్యక్రమం నిలిపేశారంటూ వార్తలొస్తున్నాయి. మరి, పరశురామ్ పంచాయితీ దిల్ రాజు ఎలా సెటిల్ చేస్తాడో, విజయ్ తో సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు