నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ సినిమా విజయం తరువాత బాలకృష్ణ వరుస సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను కర్నూల్లో అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా తరువాత బాలయ్య.. F3 దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దర్శకుడు బాబీ (కే.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక ఆ తరువాత చిత్రాన్ని కూడా దాదాపు ఖరారు చేసినట్టు కనిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. వెంకీ కుడుముల ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించే విషయం అందరికీ తెలిసిందే.
యాక్షన్ సినిమాల తరువాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఉండాలని వెంకీతో బాలయ్య సినిమా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బాలయ్య-వెంకీ కుడుముల కాంబినేషన్ తెరపైకి వచ్చింది. అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన తరువాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న బాలయ్య మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాడో వేచి చూడాలి మరి.