Kannappa : కన్నప్ప లో బ్యూటీ కోసం స్వీటీ ? ఆమెకి రీప్లేస్మెంటా?

Kannappa : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో “కన్నప్ప” సినిమా ఒకటి. మంచు విష్ణు హీరోగా ప్రధాన పాత్రలో కన్నప్ప గా నటిస్తున్న ఈ సినిమాను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మోహన్ బాబు దగ్గరుండి ఈ సినిమా షూటింగ్ ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సినిమా పై ముందుగా ఏమాత్రం అంచనాలు లేవుగాని, ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్ ఎంటర్ అయ్యాడో అప్పట్నుంచి ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా ట్రెండ్ అయి కూర్చుంటుంది.
పైగా ఈ సినిమా మైథలాజికల్ డ్రామా గా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో ప్రభాస్ పరమ శివుడిగా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు. ఇక కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప సినిమాకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ సినిమాలో దించుతున్న మోహన్ బాబు రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ని కూడా ఈ సినిమాలో భాగం చేసారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో బ్యూటీ వచ్చి చేరిందని వార్తలు వస్తున్నాయి.

కన్నప్పలో స్వీటీ.. ప్రభాస్ తో మళ్ళీ?

అయితే కన్నప్ప సినిమాలో తాజాగా మరో బ్యూటీ ఎంటర్ అయిందని తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ బ్యూటీ ఎవరో కాదు అనుష్క శెట్టి అని తెలిసింది. ఇప్పటికే ప్రభాస్ పరమశివుడి పాత్రలో ఒకే చెప్పగా ఇప్పుడు అనుష్క కూడా సెట్ అయితే బాహుబలి కాంబోలో సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉంటుంది. అనుష్క శెట్టి ఒక క్యారెక్టర్ నచ్చితే స్పెషల్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఇక కన్నప్ప లాంటి సినిమాలో ఇంతమంది తారగణం ఉన్నప్పుడు ఆమె అడిగితే నో చెప్పకుండా ఉండలేదు. ఇక తప్పకుండా అనుష్క సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే అనుష్క పాత్ర విషయంలో క్లారిటీ రాలేదు.

నయన్ ని రీప్లేస్ చేస్తున్నారా?

అయితే కన్నప్పలో ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన పార్వతి దేవి గా నయనతార నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు నయనతార సెట్స్ లో అడుగుపెట్టినట్టు వార్తలు రాలేదు. అంటే ఆమె పాత్రను గనుక అనుష్క శెట్టి తో రీప్లేస్ చేయించారా అన్న డౌట్ వస్తుంది. అంటే అనుష్క నిజంగా పార్వతి పాత్ర చేస్తుందా లేదంటే గంగ పాత్ర లో నటిస్తుందా, లేదా మరేదైనా పాత్రలో కనిపిస్తున్నారా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు హిందీ మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మోహన్ లాల్, శరత్ కుమార్, శివరాజ్ కుమార్ వంటి లెజెండరీ ఆక్టర్స్ కూడా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పరమేశ్వరుడిగా, నయనతార పార్వతి గా గెస్ట్ అప్పీరెన్స్ అవ్వనున్నారు. అలాగే కృతి సనన్, తాజాగా అక్షయ్ కుమార్ ని తో పాటు బ్రహ్మానందం, మోహన్ బాబు కూడా రంగంలోకి దిగారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు