Bhagavanth Kesari: తీసిందే రొటీన్ సినిమా.. మళ్ళీ అవార్డులు పరిగెత్తుకుంటూ రావాలంట!

టాలీవుడ్ లో ఈ దసరా కి రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో “భగవంత్ కేసరి” ఒకటి. నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్ గా, శ్రీ లీల ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా దసరా కి రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకోగా, లాంగ్ రన్ లో కష్టం మీద నిన్న బ్రేక్ ఈవెన్ అయింది. ఈ సందర్బంగా “భగవంత్ కేసరి” టీమ్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుక కి కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ హిట్ కావడానికి కారణమైన ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్తూ, ఓ మాటగా “అవార్డుల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు”, నిజంగా వాటికి మనసుంటే పరిగెత్తుకుంటూ బాలయ్య దగ్గరికి, శ్రీ లీల దగ్గరికి వచ్చేయాలి అని, ఎందుకంటే అంత పెద్ద పెర్ఫార్మన్స్ ఇచ్చారు అన్నాడు.

పెర్ఫార్మన్స్ వరకు ఒకే. ఈ సినిమాలో ఏమంత విషయముందని అవార్డులు రావాలంటున్నావు డైరెక్టరూ అని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే భగవంత్ కేసరి నిజానికి ఒక నార్మల్ కమెర్షియల్ సినిమా. స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదో ఆడపిల్లల గురించి ఒక ఐదు నిమిషాల మంచి సీన్ తప్ప, అన్నీ ఎక్కోడో ఒక చోట చూసిన సీన్లే. బాలయ్య స్క్రీన్ ప్రేజెన్స్ వల్ల, పోటీగా పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల ఈ మాత్రమైనా ఆడింది.

- Advertisement -

అసలు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టిందంటే సినిమా బలం ఏంటో అక్కడే తెలిసిపోయింది. మళ్ళీ అవార్డుల విషయం తీసి పరువు తీసుకోవడం ఎందుకు అనిల్ అని కామన్ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక భగవంత్ కేసరి రిలీజ్ అయిన 22 రోజులకి బ్రేక్ ఈవెన్ కాగా, కొన్ని ఏరియాల్లో నష్టాల్లోనే ఉంది.

For More Updates :  Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు