Aishwarya Rajesh
డస్కీ స్కిన్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. పేరుకి తెలుగమ్మాయే అయిన కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా పేరు తెచ్చుకొని అక్కడ వరుస సినిమాలతో బిజీ అవుతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో తన సన్ డే స్పెషల్ యాక్టివిటీని షేర్ చేసింది.
ఇటీవలనే ఐశ్వర్య రాజేష్ చివరిగా నటించిన ఫర్హానా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన ఈమె.. ఆ సినిమా ప్రెస్ మీట్ లో పుష్ప సినిమాలో రష్మిక రోల్ తనకు వచ్చి ఉంటె ఇంకా బాగా చేసేదాన్ని అని చెప్పి గ్లామర్ పాత్రల మీద తనకున్నా ఇష్టాన్ని చెబుతూనే కాంట్రావర్సీ కి తెర తీసిన విషయం తెలిసిందే. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం తమిళ్ మలయాళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్.. తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ గా నిలబడలేకపోతుంది.
అయితే హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఎలా ఉన్న కానీ తన పర్సనల్ లైఫ్ ను మాత్రం ఐశ్వర్య చక్కగా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులతో తన ఆనందాన్ని ఎప్పటికప్పుడు పంచుకునే ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ గా ఆదివారం వస్తే చాలు బిర్యానీ తినకుండా ఉండలేను అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. గ్లామర్ మీద పిచ్చితో హీరోయిన్స్ ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ మరియు నాన్ వెజ్ లకు దూరంగా ఉండటం మాములే కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం అలాంటి హద్దులు ఎం పెట్టుకోకుండా తన పర్సన ల్లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే మరోపక్క తనకు చేతికొచ్చిన సినిమాలు చేస్తుంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.