Kartikeya2: చందు మొండేటికి బంపర్ ఆఫర్..!

కార్తికేయ2 ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ చందు మొండేటి తన నెక్స్ట్ మూవీస్ జాగరత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ తో రెండు సినిమాలు కమిట్ అయిన చందు, నాగచైతన్య హీరోగా గీత ఆర్ట్స్ తో మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడు సినిమాలకు గీత ఆర్ట్స్ సంస్థ చందుకి భారీ మొత్తంలో 30కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందని సమాచారం అందుతోంది. ఈ లైనప్ లో మొదట కోలీవుడ్ హీరో సూర్యతో సినిమా చేయనున్న చందు ఆ తర్వాత ఓ బాలీవుడ్ సినిమా, అది పూర్తయ్యాక నాగచైతన్యతో మరో సినిమా చేయనున్నాడు.

గీత ఆర్ట్స్ లాంటి సంస్థతో వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలు కమిట్ అవ్వటం చందు లాంటి యంగ్ డైరెక్టర్ కి గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటిదాకా చిన్న హీరోలతో మినహా స్టార్ పెద్ద హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం లేని చందు కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకొని స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు.

నాగచైతన్యతో గతంలో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు తీసిన చందు, ఇప్పుడు మూడోసారి కలిసి పని చేయనున్నాడు. ఇటీవల కస్టడీ సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న చైతూకి గీతా ఆర్ట్స్ రూపంలో మరోసారి లక్ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాని ఈ సినిమాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, చందు ఎలాంటి కథలు సిద్ధం చేస్తాడు వంటి డీటెయిల్స్ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు