Trivikram : త్రివిక్రమ్ సరికొత్త ప్రయోగం

స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మాటలు రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించి తన ప్రత్యేకతను చూపించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని రైటర్ గా తనకంటూ కొంత పేరును సంపాదించుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కేవలం త్రివిక్రమ్ పేరును పోస్టర్ పై చూసి కూడా సినిమాకి వెళ్లే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. రచయిత గా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తరుణ్ హీరోగా నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో మంచి పేరు సాధించుకొని మహేష్ బాబుతో అతడు సినిమాని చేశారు.

అతడు సినిమా కమర్షియల్ గా థియేటర్ వద్ద హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ టీవీలో చూసిన ప్రతిసారి ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. అయితే త్రివిక్రమ్ కెరియర్ లో తరుణ్, నితిన్ వంటి మిడ్ రేంజ్ హీరోలతో రెండు సినిమాలు మాత్రమే చేశారు. మిగతా సినిమాలన్నీ మాక్సిమం స్టార్ హీరోలతోనే చేశారు. ఇదివరకే మహేష్ బాబుతో మూడు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే త్రివిక్రమ్ కెరియర్ లో ఫెయిల్యూర్ కంటే కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

అజ్ఞాతవాసి మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. ఇకపోతే రీసెంట్ గా మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాను చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తో మొదలై తర్వాత మంచి టాక్ సాధించుకొని సేఫ్ జోన్ లో నిలబడింది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదు అనుకున్న తరుణంలో, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది చిత్ర బృందం. అయితే తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమాను చేయనున్న సంగతి అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమాల్లో ఇదివరకు ఎవరు డ్యూయల్ రోల్ లో కనిపించలేదు. ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కనిపించిన కూడా డ్యూయల్ రోల్ చేయడమనేది ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ వేరే రేంజ్ కి వెళ్లిపోయాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. వీరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే త్రివిక్రమ్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో, గుంటూరు కారం సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమాకి కూడా ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు