Tillu Square Collections : అదరగొడుతున్న టిల్లు.. 6 రోజుల్లోనే ఎన్ని కోట్లంటే..?

Tillu Square Collections : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తారనే ఒక మార్క్ ఉంది.. ఈ క్రమంలోనే ఇతడిని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోని చేసిన సినిమా డీజే టిల్లు.. సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నా..ఈ సినిమా పాటలు ఇంకా అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. అంతటి బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు సిద్దు జొన్నలగడ్డ.. ఇక తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడమే కాదు భారీగా కలెక్షన్లను కూడా వసూలు చేస్తూ.. రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.. ఈ క్రమంలోనే ఆరు రోజుల్లోనే ఈ సినిమా ఎంత వసూల్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.

టిల్లు స్క్వేర్..

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా… అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ నిర్మించారు.. స్నేహ శెట్టి, ప్రిన్స్ , మురళీధర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్, శ్రీ చరణ్ పాకాల , రామ్ మిరియాల సంగీతాన్ని అందించారు.. ఇక ఈ సినిమా కథ , పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో రోజురోజుకీ కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి..

ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

ఆరు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ సినిమా ( Tillu Square Collections ) ప్రపంచవ్యాప్తంగా రూ.91 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈ మూవీ యూఎస్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 25 కోట్ల రూపాయలను వసూల్ చేసింది.. ఇక మరో రెండు రోజుల్లో రూ .100 కోట్ల మైలు రాయిని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.. రూ.100 కోట్ల క్లబ్లో చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా వారం రోజుల్లోనే తప్పకుండా ఈ మార్క్ ను దాటుతుంది అంటూ కూడా సినీ నిపుణులు చెబుతున్నారు.. మొత్తానికైతే డీజే టిల్లు సినిమా లాగే ఆ సినిమా సీక్వెల్ రెండూ కూడా సిద్దు జొన్నలగడ్డకి మంచి విజయాన్ని అందించాయని చెప్పవచ్చు.

- Advertisement -

హీరోయిన్ పై విమర్శలు..

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఎంతోమంది హీరోయిన్లని అనుకున్నారు.. అయితే సిద్దు వల్లే వారంతా వెళ్ళిపోయారనే వార్తలు కూడా వినిపించాయి. చివరిగా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు.. ఇక ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా రెచ్చిపోయి మరీ నటించడంతో నెటిజెన్లు ట్రోల్స్ చేశారు. మొన్నటి వరకు సాంప్రదాయంగా ఉన్న ఈమె ఈ సినిమాలో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె అభిమానులు కూడా హర్ట్ అయ్యారు.. ట్రోల్స్ చేశారు కానీ ఎప్పుడూ ఒకే జోన్ కాకుండా ఇతర రోల్స్ లో కూడా నటించాలని కోరుతూనే ఈ పాత్ర చేశానంటూ చెప్పుకొచ్చింది అనుపమ.. మొత్తానికైతే ఈ పాత్ర ఈమెకు మరింత క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు