Bigboss season 7: యావర్ ని ఇరికించి సైడైపోయిన శోభా?

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 షోలో రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ సీజన్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఆడుతుండగా, కొందరు సేఫ్ గేమ్ ఆడుతూ ఇప్పటివరకు ఇన్నోసెంట్ లాగా నెట్టుకొచ్చారు. కానీ టాస్క్ లు టఫ్ అవుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా రియాలిటీలోకి వస్తున్నారు. అందరికంటే ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడిన ప్రశాంత్ కూడా ఇప్పడు తనలా ఉండాలి వస్తుంది. ఇప్పుడు శోభా తన రియాలిటీలో అందర్నీ మించిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో యావర్, శోభా శెట్టిలను సంచాలక్ గా నియమించగా, ఈ గేమ్ లో అందరూ చిన్న చిన్న పొరపాట్లు చేయడం జరిగింది. అయితే సంచాలక్ డెసిషన్స్ లో యావర్, శోభా శెట్టి లో యావర్ కరెక్ట్ డెసిషన్ ఇవ్వగా, శోభా తనకి అనుకూలంగా మార్చుకుని యావర్ ని కన్విన్స్ చేసింది. అయితే ఈ టాస్క్ లో అందరూ తమకి న్యాయం జరగలేదంటూ గొడవ చేయగా, శోభా కూడా తనని అంటున్నారంటూ, ఇంతకు ముందు తాను చేయని తప్పుకు బిగ్ బాస్ తో మాట పడాల్సి వచ్చిందని అరుస్తూ, తనకు కూడా అన్యాయం జరిగిందంటూ యావర్ ని ఇరికించింది.

ఈ సందర్భంలో యావర్ ని అందరూ అనవసరంగా బ్లేమ్ చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా అమర్ దీప్, సందీప్ మాత్రమే కాకుండా, యావర్ ని సపోర్ట్ చేసిన శివాజీ, ఇంకా పల్లవి ప్రశాంత్ కూడా తనని అపార్ధం చేసుకున్నాడు. అక్కడ యావర్ ఓడిపోయినా ఫీల్ అవ్వలేదు. కానీ సంఛాలక్ గా తన డెసిషన్ ఫెయిల్ అంటూ అందరూ నిందిస్తుంటే కంటతడి పెట్టాడు. కానీ మరో సంచాలక్ గా ఉన్న శోభా మాత్రం తనకేమి తెలియనట్టు సైడ్ అయిపోయి యావర్ ని ఇరికించింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు