Biggboss season7: లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ మొదలైంది! అప్పుడే ముగ్గురు ఔట్?

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన మర్డర్ టాస్క్ పూర్తవగా, ఈ టాస్క్ లో అంతా సగం వరకే పెర్ఫార్మ్ చేశారన్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ కూడా ఈ టాస్క్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఈ టాస్క్ పూర్తవగానే కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. అయితే ఈ వారం జరగబోయే కెప్టెన్సీ టాస్క్ చివరిది అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అందుకని కంటెస్టెంట్స్ అందరు ఎవరికీ వారు తమ ఇష్టమైన వాళ్ళని గెలిపిద్దామని ట్రై చేస్తున్నారు.

ఇక ఈ టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ కి ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో ఇద్దరిలో ఒకర్ని నామినేట్ చేస్తూ, ఇంకొకరిని గేమ్ లో నుండి ఒక మిషిన్ గన్ తో ఫోటో కాల్చి తీసేయమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఆల్రెడీ ముగ్గురు గేమ్ నుండి తప్ప్పుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళే శోభా శెట్టి, ప్రశాంత్, అశ్విని.

అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం టీమ్ లో దాదాపుగా కొత్త వారే కెప్టెన్ అవుతారని అంచనా వేస్తున్నారు. అంటే ఇంతకు ముందు కానీ వారన్న మాట. ఆ లెక్కన ఈ వారం కెప్టెన్ అమర్ దీప్, లేదా రతిక అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాల్లో ఎండ్ అవుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు