Dulquer Salmaan : అరుదైన రికార్డు

మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా టాలీవుడ్ లో రెండోసారి చేసిన చిత్రం సీతారామం. ప్రేమ కావ్యాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సీతారామం వచ్చింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నటించారు. అలాగే టాలవుడ్ అగ్ర కథానాయక రష్మికా మందన్నా, నటుడు సుమంత్, దర్శకుడు తరుణ్ భాస్కర్, సీనియర్ నటి భూమిక కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది.

మొదటి షో నుండే ఈ చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. రాము, సీతల ప్రేమను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. తాజాగా ఈ చిత్రం ఓ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఒక మాలీవుడ్ హీరో, నేరుగా తెలుగు సినిమా చేసి 50 కోట్ల గ్రాస్ ను సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన రికార్డు మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నమోదు చేశారు.

ఈ రికార్డు సోమవారం నాటికే సీతా రామం అందుకుంది. దీన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే హీరో దుల్కర్ సల్మాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఈ ప్రేమ ఎప్పటికీ ఆగిపోనిది అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు