Tollywood Movies : కామెడీ సీక్వెల్స్ ఆన్ కార్డ్స్… టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ షురూ

Tollywood Movies : ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సీక్వెల్స్ రాజ్యమేలుతున్నాయి. నిన్న మొన్నటిదాకా పాన్ ఇండియా మోజులో పడ్డ మేకర్స్ అంతా ఇప్పుడు కామెడీపై కాన్సన్ట్రేట్ చేశారు. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా రేసులో వెనకబడిపోయిన డైరెక్టర్స్, హీరోలకు ఇదొక వరంగా మారింది. టాలీవుడ్ లో అందరు మేకర్స్ ఆలోచన ఇదే అని చెప్పలేము. కానీ ప్రస్తుతం తెరకెక్కబోతున్న కొన్ని క్రేజీ కామెడీ సీక్వెల్స్ తో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాల వల్ల రిస్క్ తక్కువ, లాభాలు ఎక్కువ. బ్లాక్ బస్టర్ హిట్ అయితే సీక్వెల్ ను పట్టాలెక్కించడంతో పాటు అదనంగా డబ్ చేసి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసి లాభాలను ఆర్జించవచ్చు. ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు కొంతమంది టాలీవుడ్ మేకర్స్.

కామెడీ ఫ్రాంచైజీలపైనే కన్ను

ప్రస్తుతం టాలీవుడ్ లో ( Tollywood Movies ) కామెడీ ఫ్రాంచైజీల ట్రెండ్ నడుస్తోంది గురూ. రీసెంట్ గా రిలీజైన “టిల్లు స్క్వేర్” మూవీతో ఇది మరింతగా ఊపందుకుంది. “డిజే టిల్లు” అనే బ్లాక్ బస్టర్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” తెరపైకి వచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్ లో మరో సీక్వెల్ ఉంటుందనే విషయాన్నీ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. “టిల్లు క్యూబ్” పేరుతో మూడవ సీక్వెల్ రాబోతోంది. మరో కామెడీ హిట్ మూవీ మ్యాడ్ రెండో భాగం పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. సీక్వెల్‌కి “మ్యాడ్ మ్యాక్స్” అని పేరు పెట్టారు. ఇది ఈ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. సీక్వెల్ హిట్ అయితే ఈ మూవీ కూడా ఫ్యూచర్ లో మరిన్ని సీక్వెల్స్ తో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఆ తర్వాత గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న “జాతిరత్నాలు 2” గురించి మాట్లాడుకోవాలి. రెండవ భాగం ఖచ్చితంగా తెరకెక్కుతోందని మేకర్స్ ప్రకటించారు. కానీ అది ఎప్పుడు తెరపైకి వెళ్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. మరో తెలుగు కామెడీ డిటెక్టీవ్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు కూడా సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది కూడా జరిగితే టాలీవుడ్‌లోని కామెడీ-డ్రామా ఫ్రాంచైజీల జాబితాలో మరో కొత్త మూవీ చేరుతుంది.

టాలీవుడ్ లోనే ఈ ట్రెండ్

ఇతర పరిశ్రమలలో కామెడీ ఫ్రాంచైజీలను చాలా తక్కువగా తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ లో మాత్రమే ఇలా కామెడీ ఎంటర్టైనర్ ల ఫ్రాంచైజీలు ఎక్కువ సంఖ్యలో పట్టాలు ఎక్కుతున్నాయి. ఇప్పటికే టిల్లు, మ్యాడ్ ఫ్రాంచైజీలు ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతి రత్నాలు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతానికి భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమలో కూడా ఈ రెంజ్గ్ లో కామెడీ సినిమాల హవా నడవట్లేదు.ఇక ఈ కామెడీ ట్రెండ్ తో పాటు పుష్ప, సలార్, దేవర వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా మన ఇండస్ట్రీ నుంచే వస్తూ ఉండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు