సాధారణంగా ఒక సినిమా తెరకెక్కించాలంటే ఒక దర్శకుడి టాలెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. సినిమాలో తెరకెక్కించే విధానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ సినిమాను ప్రేక్షకులు చూడడానికి అంతగా ఆసక్తి కనబరచరు. ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడికే ఉంటుంది. అదే సినిమా ఫ్లాప్ అయినా దర్శకుడినే విమర్శిస్తుంటారు. ఇటీవల టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన పూరి జగన్నాథ్ లైగర్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. పూరి జగన్నాథ్ గతంలో పోకిరి వంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన సృష్టించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు పూరి అంత మంచి సినిమాలు తీశాడు. ఆ తరువాత చాలా సినిమాలు తీసినప్పటికీ అవి నిరాశ పరిచాయి. మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్లోకి వచ్చాడు. ఫామ్ లోకి వచ్చాడనుకున్న తరుణంలోనే లైగర్ మూవీతో మరో ఫ్లాప్ మూట గట్టుకున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రతిభను ప్రశంసిస్తూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వినాయక్. “పూరీ తన కెరీర్లో ఇప్పటికే చాలా ఎత్తుపల్లాలు చూశాడు. పూరి జగన్నాథ్ ప్రతిభ గురించి కేవలం సన్నిహితులకు మాత్రమే తెలుసు. ప్రస్తుతం లైగర్ సినిమా ప్లాఫ్ కావడంతో నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు చాలా సినిమాలు హిట్ అయ్యాయి. హిట్ అయినప్పుడు పొగడడం, ఫ్లాప్ అయినప్పుడు తిట్టడం అలవాటుగా మారింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ని విమర్శిస్తున్నారు. లైగర్ ఫ్లాప్ తరువాత అతన్ని విమర్శించే వారందరికీ మంచి హిట్ సినిమా తీసి వారికి సరైన సమాధానం చెబుతాడు. ఇప్పుడు విమర్శించిన నెటిజన్లు అప్పుడు ప్రశంసిస్తారు” అని చెప్పుకొచ్చారు.