అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమ కాదంట. ఈ సినిమాకి రాఖేష్ శశి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ కింద బన్నీ వాస్ నిర్మించారు. ఈ సినిమా యూత్పుల్ లవ్ ఎంటర్టైనరల్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సినిమా పోస్టర్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఈ తరుణంలోనే ఈ చిత్రాన్ని నవంబర్ 04న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. గతంలో విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. జంట ప్రయాణానానికి చక్కని దృశ్యకావ్య రూపంగా ఉండనుందట. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం తన్వీర్ మీర్ బాధ్యతలు వహిస్తున్నారు.
అల్లు శిరీష్ చాలా రోజుల తరువాత సినిమా తీస్తుండడంతో ఈ సినిమాపై అల్లు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 2019లో ఏబీసీడీ మూవీ తరువాత అల్లు శిరీష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రేమికులను ఆకట్టుకునేవిధంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బిగ్ హిట్ లేకుండా ఉన్న అల్లు శిరీష్ కు ఈ ప్రేమ కాదంటతో అయిన హిట్ లభిస్తుందా అని తెలియాలంటే నవంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.